శ్రీరాం పుప్పాల
ప్రపంచమంతా కవిత్వం తో నిండి ఉంది. ఈ గాలి ఆ కవిత్వం ఇచ్చే స్పిరిట్ తోనే జీవిస్తోంది. అంతే కాదు, ఈ తరంగాలు ఆ కవిత్వం యొక్క సంగీతం తో, దాని శ్రావ్యత గల పాటలతో, అంతే కాదు , కవిత్వపు వెలుగు లోనే మెరుస్తుంది..... జేమ్స్ గేట్స్ పెర్సివాల్
THE WORLD IS FULL OF POETRY. THE AIR IS LIVING WITH ITS SPIRIT AND THE WAVES DANCE TO THE MUSIC OF ITS MELODIES, AND SPARKLE IN ITS BRIGHTNESS…JAMES GATES PERCIVAL
సరిగ్గా ఇలాగే ఆలోచిస్తాడు రాజమండ్రి కి చెందిన శ్రీరాం. పి. ఆయన మాట్లాడితే కవిత్వం. తన చుట్టూ కవిత్వం ఉందని భావిస్తాడు. కొత్తగా రాయలంటాడు. అదేదో నచ్చనిదాన్ని బద్దలు కొట్టి, దాంట్లోనుంచి, నచ్చినదేదో కవిత్వం ద్వారా తీసుకోవాలంటాడు. విస్పోటనం లాంటి కవిత్వం సృజించాలంటాడు. నాకు తెలిసి ఆయనే ఓ కవిత్వం. ప్రస్తుతం కడియం పట్టణం లో ఆంధ్రా బ్యాంకు చీఫ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. రాత్రి పొద్దు పోయే వరకు , దాదాపు మూడు గంటలు మాట్లాడినా, ఆయన తనివి తీరలేదు. ఆ కవిత్వ దాహం అలాంటిది. సురేష్ గారూ... కేవలం కాలతీతమవుతుందని తప్ప .. ఫోన్ పెట్టేయ బుద్ధి కాలేదు అని చెప్పారు. అతి తక్కువ వ్యవధి లోనే అత్యంత ఆప్తుడయ్యారు.
ఇటీవలే రాధేయ పురస్కారం అందుకొన్న అద్బుత కవి శ్రీరాం పుప్పాల. ఆయన రాసిన “యుద్ధ నౌక” కు ఉత్తర అమెరిక తెలుగు సంఘం (నాట) కవితల పోటీల్లో మొదటి అవార్డ్ వచ్చింది. ఎలాంటి భేషిజాలు లేని, అతి మంచి వ్యక్తి శ్రీరాం. వందకు పైగా కవితలు రాసారు. త్వరలో సంకలనం వేయాలన్నది ఆయన ఆకాంక్ష.
ఈనాటి ఈ శీర్షిక కు ఆయన అతిధి.
..
ఆయన గురించి ఆయన మాటల్లోనే విందాం....
సాహితీ ప్రయాణం :
ఈ బ్యాంక్ ఉద్యోగమూ, బిజీ పనుల, సాధారణ రణగొణ జీవితం నుంచి మరో పక్కకు రావటం, ప్రపంచాన్ని కొత్త చూపు తో చూడటం, కవిత్వంలోకి రావడం...పాఠాలు చెప్పిన తెలుగు టీచర్ల ప్రభావం. ఆరవ తరగతిలోనే సోషల్ కాన్సెప్ట్ తో ఓ కవిత రాశాను. అది స్కూల్ మేగజైన్ లో పబ్లిష్ అయింది. ఆ తరువాత టి..కె. చూడామణి గారు, శర్మ గారు లాంటి టీచర్ల వల్ల తెలుగు అంటే మక్కువ ఏర్పడింది.
..
ఇంటర్మీడియట్, విజయవాడ సిద్దార్థ కాలేజ్ లో తాటి శ్రీ కృష్ణ గారు తెలుగు లెక్చరర్. ఆ మహానుభావుడు 'అరుణ తార' అనే పుస్తకం నా చేతికిచ్చిన వ్యక్తి. రావి శాస్త్రి ని పరిచయం చేసిన వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తి దొరకటం నా జీవితంలో అదృష్టం. "మో" వేగుంట మోహన్ ప్రసాద్ గారనే మహాకవి ి అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్. ఆ కాలేజ్ మేగజైన్ కు ఎడిటర్ కూడా. నేను కవిత రాసుకెళ్ళటం ఆయన అది ప్రచురించటం ఇలా నడిచింది. అప్పటికి ఆయన అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియదు....
..
అప్పట్లోనే ఆలిండియా రేడియో లో నెలకొకసారి 'కవితా కిరణాలు' 'భావ చిత్రాలు' అని ఓ శీర్షిక నడిపేవాళ్ళు. వచన కవిత్వంలో సమస్యాపూరణం. అందులో గెలవటం రేడియో లో ఇంటర్వ్యూ రావటం జరిగింది.
..
18 సంవత్సరాల వయసులో అప్పట్లో విశాలాంధ్ర లో ముత్యాల ప్రసాద్ గారు ఆదివారం పేజీలో కవితలు ప్రచురించి ప్రోత్సహించారు. ఆ తర్వాత బియస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ బాపట్ల. అక్కడ మరో మహానుభావుడు 'వాస్తు బాబాయ్' అనే ఫేమస్ నాటిక రాసిన గొప్ప హాస్య నాటక రచయిత, గాయకుడు పివిి. రాం కుమార్ గారు మాకు జెనెటిక్స్ ప్రొఫెసర్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్. బూసురుపల్లి వెంకటేశ్వర్లు రాం కుమార్ గారికి సమకాలీకులు. వాళ్ళ ఆధ్వర్యం లో అక్కడ ఉగాది కవింసమ్మేళనాలు నిర్వహించేవారు. మళ్లీ అక్కడా కాలేజ్ మేగజైన్ లో కవితలొచ్చేవి. అప్పుడే నన్ను కవిగారూ అని గౌరవంగా పిలిచేవారు.
..
మా తాతగారు కమ్యూనిస్టు అభిమాని. తెలుగు వ్యాకరణం ప్రత్యేకంగా మా అమ్మ పరమేశ్వరి గారు చదివించారు.. ఆ నేపథ్యంలోనే తొమ్మిది, పదో తరగతి సమయంలోనే పరస్పర విరుద్ధమైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి భావ కవిత్వం, మహాప్రస్థానం లాంటి విప్లవ సాహిత్యం చదివాను
..
ఇవి నా మీద ప్రభావం చూపించిన పుస్తకాలు కూడా ఇవే. అప్పుడు మొదలైన సాహిత్యం పై మోజు కొనసాగుతూనే ఉంది. బాపట్ల కాలేజ్ లో ఉన్నప్పుడు వరవరరావు కవిత్వం పరిచయమైంది.
..
ఈ అనుభవాల దృష్ట్యా మొదటి నుంచి ఒక అభిప్రాయం, నాకు సామాజిక అంశం లేనిదే అది కవిత్వం కాదనేది ప్రగాఢమైన నమ్మకం. కవిత్వం అంటేనే అది సమాజం గురించి మనుషుల గురించి మాట్లాడుతుంది. కవిత్వంలోని లయ నన్నాకర్షించిన అంశం. విజయవాడలో వారం రోజుల పాటు జరిగే బుక్ ఫెస్టివల్స్ కు అప్పటి నుంచి ఇప్పటి వరకూ హాజరవుతుండటం నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుంది. అప్పట్లో 'పూర్ణకుంభ్' అని తమిళనాడు నుంచి వచ్చే హిందీ మేగజైన్ లో హిందీ ప్రవీణ లాంటివి చదివిన అనుభవంతో హిందీ కవితలు కూడా రాయటం జరిగింది. కొత్తగా బ్యాంకు జాబ్ లో చేరినపుడు పర్సనల్ ఆఫీసర్ దర్భశయనం గారితో పరిచయం మళ్ళీ సాహిత్యం పై శ్రద్ధ కొనసాగేలా చేసింది. చేనేత కార్మికుల మీద కవితలూ అప్పుడు రాయటం జరిగింది. ఇలా ప్రతి దశలో ఎవరో ఒకరి సాంగత్యం వల్ల నాలో కవిత్వం సజీవంగా ఉంటూ వచ్చింది. ఉద్యోగం లో చేరిన తర్వాత సంపాదనపై శ్రద్ధ కామన్ గా పెరిగింది. రంపచోడవరంలో చేస్తున్నపుడు గిరిజన సమస్యల పట్ల అవగాహన పెరిగింది. అక్కడి పరిస్థితులే నా ఆలోచనలను పతాక స్థాయికి తీసుకెళ్ళాయి. పెనుకొండ ఇస్మాయిల్ గారు నాతో కలం స్నేహం చేసి, మా అక్కను వివాహం చేసుకున్నారు. 'దేవుడి సందు' అని రంజాన్ సందర్భంగా ప్రజాశక్తి లో ఒక కవిత రాశా. అది చదివి అఫ్సర్ మెసేజ్ చేసాడు. బావుంది బాగా రాయమని ప్రోత్సహించారు. అలా ఆయన పరిచయం అయారు. ఆ తర్వాత విజయవాడలో శ్రీ శ్రీ ప్రింటర్స్ దంపతులు విశ్వేశ్వర రావు , ప్రమీల లు పరిచయం తో, కవిత్వం పట్ల పరిపక్వమైన ఆలోచన చేయడానికి కారణమయ్యారు.ఆ సాహితీ మిత్రుల ఎల్లలు లేని విలాసం లోనే కవి సీతారం, కొమ్మన రాధాకృష్ణ, లెనిన్ లాంటి కవులు పరిచయం అయ్యారు. అయన 2004 నుంచి నిర్వహించిన కవిత్వం తో సాయుంకాలం కార్యక్రమ లో, క్రమం తప్పకుండ విడుదల అయిన కవితా వార్షిక సంచికలు, మరో స్ఫూర్తి దాయకమైన ప్రేరణ. ఈ సభల్లో నామాడి శ్రీధర్, జి. లక్ష్మీ నరసయ్య గారు బాగా రాయమని ప్రోత్సహించే వారు. అక్కడే అనిల్ డానీ కూడా పరిచయం.
ఈనాటి ఈ శీర్షిక కు ఆయన అతిధి.
..
ఆయన గురించి ఆయన మాటల్లోనే విందాం....
సాహితీ ప్రయాణం :
ఈ బ్యాంక్ ఉద్యోగమూ, బిజీ పనుల, సాధారణ రణగొణ జీవితం నుంచి మరో పక్కకు రావటం, ప్రపంచాన్ని కొత్త చూపు తో చూడటం, కవిత్వంలోకి రావడం...పాఠాలు చెప్పిన తెలుగు టీచర్ల ప్రభావం. ఆరవ తరగతిలోనే సోషల్ కాన్సెప్ట్ తో ఓ కవిత రాశాను. అది స్కూల్ మేగజైన్ లో పబ్లిష్ అయింది. ఆ తరువాత టి..కె. చూడామణి గారు, శర్మ గారు లాంటి టీచర్ల వల్ల తెలుగు అంటే మక్కువ ఏర్పడింది.
..
ఇంటర్మీడియట్, విజయవాడ సిద్దార్థ కాలేజ్ లో తాటి శ్రీ కృష్ణ గారు తెలుగు లెక్చరర్. ఆ మహానుభావుడు 'అరుణ తార' అనే పుస్తకం నా చేతికిచ్చిన వ్యక్తి. రావి శాస్త్రి ని పరిచయం చేసిన వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తి దొరకటం నా జీవితంలో అదృష్టం. "మో" వేగుంట మోహన్ ప్రసాద్ గారనే మహాకవి ి అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్. ఆ కాలేజ్ మేగజైన్ కు ఎడిటర్ కూడా. నేను కవిత రాసుకెళ్ళటం ఆయన అది ప్రచురించటం ఇలా నడిచింది. అప్పటికి ఆయన అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియదు....
..
అప్పట్లోనే ఆలిండియా రేడియో లో నెలకొకసారి 'కవితా కిరణాలు' 'భావ చిత్రాలు' అని ఓ శీర్షిక నడిపేవాళ్ళు. వచన కవిత్వంలో సమస్యాపూరణం. అందులో గెలవటం రేడియో లో ఇంటర్వ్యూ రావటం జరిగింది.
..
18 సంవత్సరాల వయసులో అప్పట్లో విశాలాంధ్ర లో ముత్యాల ప్రసాద్ గారు ఆదివారం పేజీలో కవితలు ప్రచురించి ప్రోత్సహించారు. ఆ తర్వాత బియస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ బాపట్ల. అక్కడ మరో మహానుభావుడు 'వాస్తు బాబాయ్' అనే ఫేమస్ నాటిక రాసిన గొప్ప హాస్య నాటక రచయిత, గాయకుడు పివిి. రాం కుమార్ గారు మాకు జెనెటిక్స్ ప్రొఫెసర్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్. బూసురుపల్లి వెంకటేశ్వర్లు రాం కుమార్ గారికి సమకాలీకులు. వాళ్ళ ఆధ్వర్యం లో అక్కడ ఉగాది కవింసమ్మేళనాలు నిర్వహించేవారు. మళ్లీ అక్కడా కాలేజ్ మేగజైన్ లో కవితలొచ్చేవి. అప్పుడే నన్ను కవిగారూ అని గౌరవంగా పిలిచేవారు.
..
మా తాతగారు కమ్యూనిస్టు అభిమాని. తెలుగు వ్యాకరణం ప్రత్యేకంగా మా అమ్మ పరమేశ్వరి గారు చదివించారు.. ఆ నేపథ్యంలోనే తొమ్మిది, పదో తరగతి సమయంలోనే పరస్పర విరుద్ధమైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి భావ కవిత్వం, మహాప్రస్థానం లాంటి విప్లవ సాహిత్యం చదివాను
..
ఇవి నా మీద ప్రభావం చూపించిన పుస్తకాలు కూడా ఇవే. అప్పుడు మొదలైన సాహిత్యం పై మోజు కొనసాగుతూనే ఉంది. బాపట్ల కాలేజ్ లో ఉన్నప్పుడు వరవరరావు కవిత్వం పరిచయమైంది.
..
ఈ అనుభవాల దృష్ట్యా మొదటి నుంచి ఒక అభిప్రాయం, నాకు సామాజిక అంశం లేనిదే అది కవిత్వం కాదనేది ప్రగాఢమైన నమ్మకం. కవిత్వం అంటేనే అది సమాజం గురించి మనుషుల గురించి మాట్లాడుతుంది. కవిత్వంలోని లయ నన్నాకర్షించిన అంశం. విజయవాడలో వారం రోజుల పాటు జరిగే బుక్ ఫెస్టివల్స్ కు అప్పటి నుంచి ఇప్పటి వరకూ హాజరవుతుండటం నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుంది. అప్పట్లో 'పూర్ణకుంభ్' అని తమిళనాడు నుంచి వచ్చే హిందీ మేగజైన్ లో హిందీ ప్రవీణ లాంటివి చదివిన అనుభవంతో హిందీ కవితలు కూడా రాయటం జరిగింది. కొత్తగా బ్యాంకు జాబ్ లో చేరినపుడు పర్సనల్ ఆఫీసర్ దర్భశయనం గారితో పరిచయం మళ్ళీ సాహిత్యం పై శ్రద్ధ కొనసాగేలా చేసింది. చేనేత కార్మికుల మీద కవితలూ అప్పుడు రాయటం జరిగింది. ఇలా ప్రతి దశలో ఎవరో ఒకరి సాంగత్యం వల్ల నాలో కవిత్వం సజీవంగా ఉంటూ వచ్చింది. ఉద్యోగం లో చేరిన తర్వాత సంపాదనపై శ్రద్ధ కామన్ గా పెరిగింది. రంపచోడవరంలో చేస్తున్నపుడు గిరిజన సమస్యల పట్ల అవగాహన పెరిగింది. అక్కడి పరిస్థితులే నా ఆలోచనలను పతాక స్థాయికి తీసుకెళ్ళాయి. పెనుకొండ ఇస్మాయిల్ గారు నాతో కలం స్నేహం చేసి, మా అక్కను వివాహం చేసుకున్నారు. 'దేవుడి సందు' అని రంజాన్ సందర్భంగా ప్రజాశక్తి లో ఒక కవిత రాశా. అది చదివి అఫ్సర్ మెసేజ్ చేసాడు. బావుంది బాగా రాయమని ప్రోత్సహించారు. అలా ఆయన పరిచయం అయారు. ఆ తర్వాత విజయవాడలో శ్రీ శ్రీ ప్రింటర్స్ దంపతులు విశ్వేశ్వర రావు , ప్రమీల లు పరిచయం తో, కవిత్వం పట్ల పరిపక్వమైన ఆలోచన చేయడానికి కారణమయ్యారు.ఆ సాహితీ మిత్రుల ఎల్లలు లేని విలాసం లోనే కవి సీతారం, కొమ్మన రాధాకృష్ణ, లెనిన్ లాంటి కవులు పరిచయం అయ్యారు. అయన 2004 నుంచి నిర్వహించిన కవిత్వం తో సాయుంకాలం కార్యక్రమ లో, క్రమం తప్పకుండ విడుదల అయిన కవితా వార్షిక సంచికలు, మరో స్ఫూర్తి దాయకమైన ప్రేరణ. ఈ సభల్లో నామాడి శ్రీధర్, జి. లక్ష్మీ నరసయ్య గారు బాగా రాయమని ప్రోత్సహించే వారు. అక్కడే అనిల్ డానీ కూడా పరిచయం.
కవిత్వానికి ఒక కొత్త రూపం అవసరం. కొత్త వాక్యం రాయొచ్చు. అనే గొప్ప అభిప్రాయం కలిగేది. ఖాదర్ మొయినుద్దీన్ 'పుట్టుమచ్చ' అనే కావ్యం నన్నెంత గానో కదిలించిన కావ్యం. త్రిపురనేని రహస్యోద్యమం, అరుణ్ సాగర్ కొత్త డిక్షన్ మ్యూజిక్ డైస్ , హెచ్ ఆర్ కె విలక్షణ వాక్యం కూడా నాపై ప్రభావం చూపింది. నచ్చేది. మొత్తం మీద ఇప్పుడు, కవిసంగమంలో ఇంతమంది కొత్త కవులను చూస్తున్నప్పుడు మనం కొత్తగా ఎలా రాయాలి? ఏం రాయాలి? అనిపిస్తుంటుంది. కర్నాటక, తమిళనాడు ల మధ్య కావేరి జలాల వివాదం, ఆత్మహత్యలు జరగటం, మన దగ్గర కూడా నీళ్ళ గురించి వివాదాలుండటం నన్ను మనస్తాపానికి గురిచేసింది. అప్పుడు నీళ్ళు అంశం మీద రాయటం మొదలెట్టి 'నాటా' వారి పోటీకి పంపాను. పాలింకిన ఇసుక రొమ్ములు ,ఏడుపు బంతుల్లా దొర్లి పడే కన్నీళ్లు, తడి కిరీటం, తలలు లాంటి రాళ్ళు పగిలిన నీళ్ళ ఒడ్డున నిప్పు రాజుకున్న గుర్తులు, ఇవన్నీ కూడా కొత్త పదాలని , వాటిని వాడే సందర్భాలను, ఆ సందర్భాలు చెప్పే భావాల్ని, మనకు సజీవంగా కళ్ళకు కట్టేస్తాయి.. ఈ కవితకు మొదటి శ్రోత పాయల మురళీకృష్ణ.
కవి సంగమం గురించి....
కవి సంగమం వర్ధమాన కవుల్ని ఒక వేదిక మీదికి తెచ్చిన ప్రయత్నం. చాల అద్బుత ప్రయోగం కూడా. యాకూబ్ గారు ఎంతో ప్రశంసార్హమైన వ్యక్తి. నేడు కుర్రాళ్ళల్లో కొన్ని బలమైన గొంతులు వినిపిస్తున్నయంటే అది కవి సంగమం పుణ్యమే. ఇది మరింత పకడ్బందీగా నిర్వహించాలి. అప్పుడు మరిన్ని అద్బుతాలు జరిగి తీరుతాయి.
కవి సంగమం వర్ధమాన కవుల్ని ఒక వేదిక మీదికి తెచ్చిన ప్రయత్నం. చాల అద్బుత ప్రయోగం కూడా. యాకూబ్ గారు ఎంతో ప్రశంసార్హమైన వ్యక్తి. నేడు కుర్రాళ్ళల్లో కొన్ని బలమైన గొంతులు వినిపిస్తున్నయంటే అది కవి సంగమం పుణ్యమే. ఇది మరింత పకడ్బందీగా నిర్వహించాలి. అప్పుడు మరిన్ని అద్బుతాలు జరిగి తీరుతాయి.
కవి సంగమం శీర్షిక ల గురించి....
శీర్షికలన్నింటి లో లక్ష్మి నరసయ్య గారిది మీ కవిత్వానువాద శీర్షిక బాగుంటుంది. ఒకటి బేసిక్ సంగతులు సింపుల్ గా చెప్పే శీర్షిక. మరొకటి అద్బుతమైన వ్యాఖ్యానము చాల ఇంటరెష్టి౦గ్ గా ఉంటుంది.
శీర్షికలన్నింటి లో లక్ష్మి నరసయ్య గారిది మీ కవిత్వానువాద శీర్షిక బాగుంటుంది. ఒకటి బేసిక్ సంగతులు సింపుల్ గా చెప్పే శీర్షిక. మరొకటి అద్బుతమైన వ్యాఖ్యానము చాల ఇంటరెష్టి౦గ్ గా ఉంటుంది.
కవిత్వానువాదం శీర్షిక పై....
ఈ శీర్షిక లో మంచి మంచి తెలుగు కవితలని తీసుకొని, అంతే నిబ్బరంగా, సమర్థవంతంగా, ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్నారు. మీరు ఆంగ్ల కవిత్వాన్ని కొత్త తరం కవులతో పరిపుష్టం చేస్తున్నారు. ఇది భావి తరాలకి ఒక చరిత్ర.
ఈ శీర్షిక లో మంచి మంచి తెలుగు కవితలని తీసుకొని, అంతే నిబ్బరంగా, సమర్థవంతంగా, ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్నారు. మీరు ఆంగ్ల కవిత్వాన్ని కొత్త తరం కవులతో పరిపుష్టం చేస్తున్నారు. ఇది భావి తరాలకి ఒక చరిత్ర.
వర్ధమాన కవులకు సూచనలు...
సూచనలిచ్చెంత పెద్దరికం నాకేక్కడుంది? కొత్తగా మాత్రం రాయాలి. ఫ్రెష్ గా అదో విస్పోటనం లా ఉండేట్టు, చురుక్కుమనేట్టు రాయాలి. కవులు సమాజం లోనుంచి రాయాలి.
సూచనలిచ్చెంత పెద్దరికం నాకేక్కడుంది? కొత్తగా మాత్రం రాయాలి. ఫ్రెష్ గా అదో విస్పోటనం లా ఉండేట్టు, చురుక్కుమనేట్టు రాయాలి. కవులు సమాజం లోనుంచి రాయాలి.
ఈ కవిత నేపధ్యం... ఆయన మాటల్లో..
ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో ఇసిస్ దాడి కి 39 మంది బారతీయులు చనిపోయారు. వారి స్మృతి లో ఈ కవిత. మతోన్మాద ఉగ్రవాదులకి భారతీయ విశ్వాసలెలా ఉంటాయో, తెలియ చెప్పే కవిత. చనిపోయిన వాళ్ళల్లో ముస్లీం లు, సిక్కులు ఇద్దరూ ఉన్నారు. భారత ప్రభుత్వం వాళ్ళ చావు గురించి, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేట్ గ, అదీ పర్సనల్ గా చెప్పకుండా, డైరెక్ట్ గా పార్లమెంట్ లో ప్రకటించినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉందో తెలియ చెప్పిన కవిత. డబ్బులు కాదు మనుషులు కావాలని ఇంటివాళ్ళు ఏడ్చే కవిత.
ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో ఇసిస్ దాడి కి 39 మంది బారతీయులు చనిపోయారు. వారి స్మృతి లో ఈ కవిత. మతోన్మాద ఉగ్రవాదులకి భారతీయ విశ్వాసలెలా ఉంటాయో, తెలియ చెప్పే కవిత. చనిపోయిన వాళ్ళల్లో ముస్లీం లు, సిక్కులు ఇద్దరూ ఉన్నారు. భారత ప్రభుత్వం వాళ్ళ చావు గురించి, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేట్ గ, అదీ పర్సనల్ గా చెప్పకుండా, డైరెక్ట్ గా పార్లమెంట్ లో ప్రకటించినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉందో తెలియ చెప్పిన కవిత. డబ్బులు కాదు మనుషులు కావాలని ఇంటివాళ్ళు ఏడ్చే కవిత.
ఇటీవలే రాధేయ అవార్డు సాధించిన ఈ కవిత నాకు ఒక కత్తి మీద సాము. మొత్తంగా వాడుక బాష, ప్రతీకలు, ఇడియమ్స్ తో కూడుకొన్నది. శ్రీరాం గారు రాసిన ఈ కవిత కవిత ప్రియులందరూ చదవాల్సిందే.
మనసుకు హత్తుకొని మనల్ని ఏడిపించే కవిత ఈ “మెహరూం కా మోహబ్బత్ నామ” ! అనుసృజన లో పూర్తి స్వేఛ్చ తో కవిత మూలాన్ని అర్థం చేసుకొని చేసాను.... ఎంజాయ్ దిస్ ట్రాజిక్ లిరికల్ పోయెమ్.!!
..
..
శ్రీరాం .పి.|| మెహ్ రూం -కా-మొహబ్బత్ నామా ||
మనసుకు హత్తుకొని మనల్ని ఏడిపించే కవిత ఈ “మెహరూం కా మోహబ్బత్ నామ” ! అనుసృజన లో పూర్తి స్వేఛ్చ తో కవిత మూలాన్ని అర్థం చేసుకొని చేసాను.... ఎంజాయ్ దిస్ ట్రాజిక్ లిరికల్ పోయెమ్.!!
..
..
శ్రీరాం .పి.|| మెహ్ రూం -కా-మొహబ్బత్ నామా ||
సి. వి. సురేష్
అనుసృజన: || THE LOVE LETTER OF THE DECEPTED||
..
As
The village farmland was not imbrued
Moving faraway..
By leaving the womb of mother
You ligate the niche of apprehension
by
Bailing the body of out flowed tears in fist…
N’ leaving the sacrifying ray of your family..
N’ departing from the tender seeds…!
..
in the
Starved stomach alike,
the narrowed pile of home….
The sonority of
tea cups n’ saucers and the big biryani vessel..
while cleaning…!
The unbearable fumed land
In the heart underneath the legs!
The whole heartstrings
Masked with black emptiness!
..
There…
No visa tree will give sweet date
Except.
The shattered blood of migrants
Along the shore of the red sea!
N’
The pledged sorrowful tears
In the whole salty liquid of Persian gulf..!
..
from the day
You left the house…..
Jasmine of our backyard
Singing the lonely solo song…
On the service bed….
From the dinars n’ courage you sent!!
Landmarks which can’t live without you…
Never being translated into heavens
..
You are the only one….
By screwing the spikes in the sandy machine
Hanging alike the tail of poverty
To the kites of desert appetence!!
When you intake the food?
When you slept in peace?
The psalms of the gurbhani..
‘Akala nirankaara’… “alak niranjaa’
Sung by sardhaari neighbour
Alike the tone of the ajhaa fort….
The flying smooth pigeon
Always come n’ fall
On the house exactly at prayer time
..
laying in the open yard
While, counting the frayed star- lines
Of our palm like birth town
I glared
Forty crescents standing ..
by bending their knees in abroad..
who searched the birth-moles.!!!
అనుసృజన: || THE LOVE LETTER OF THE DECEPTED||
..
As
The village farmland was not imbrued
Moving faraway..
By leaving the womb of mother
You ligate the niche of apprehension
by
Bailing the body of out flowed tears in fist…
N’ leaving the sacrifying ray of your family..
N’ departing from the tender seeds…!
..
in the
Starved stomach alike,
the narrowed pile of home….
The sonority of
tea cups n’ saucers and the big biryani vessel..
while cleaning…!
The unbearable fumed land
In the heart underneath the legs!
The whole heartstrings
Masked with black emptiness!
..
There…
No visa tree will give sweet date
Except.
The shattered blood of migrants
Along the shore of the red sea!
N’
The pledged sorrowful tears
In the whole salty liquid of Persian gulf..!
..
from the day
You left the house…..
Jasmine of our backyard
Singing the lonely solo song…
On the service bed….
From the dinars n’ courage you sent!!
Landmarks which can’t live without you…
Never being translated into heavens
..
You are the only one….
By screwing the spikes in the sandy machine
Hanging alike the tail of poverty
To the kites of desert appetence!!
When you intake the food?
When you slept in peace?
The psalms of the gurbhani..
‘Akala nirankaara’… “alak niranjaa’
Sung by sardhaari neighbour
Alike the tone of the ajhaa fort….
The flying smooth pigeon
Always come n’ fall
On the house exactly at prayer time
..
laying in the open yard
While, counting the frayed star- lines
Of our palm like birth town
I glared
Forty crescents standing ..
by bending their knees in abroad..
who searched the birth-moles.!!!
..
May be my hungry is my identity
I scarf my head with pious
When sevadar called me for lunger
With golden plate…!
Religion is my epistle
Which taught me how to fight…!
May be my hungry is my identity
I scarf my head with pious
When sevadar called me for lunger
With golden plate…!
Religion is my epistle
Which taught me how to fight…!
ఒరిజినల్ పోయెమ్ ......!
పి. శ్రీరాం || మెహరూం కా మోహబ్బత్ నామా
..
ఊరిపొలంలోకిన్ని నీళ్ళు రాలేదని
గట్టుతెగిన కన్నీళ్ళ దేహాన్నో గుప్పిట మూటగట్టుకుని
వత్తిలా కాలుతున్న చూపుల ఇంటిదీపాన్నొదిలి
నేలలో నాటిన పసి గింజల్నొదిలి
అమ్మ కడుపులోంచి
ఎక్కడికో సుదూరంగా వెళ్ళి
నువ్వో దిగులు ఇసుకగూడు కడతావు
..
ఇరుకింటి మోరీ లాంటి ఆకలి కడుపులో
కడుగుతున్న చాయ్ కప్పులూ సాసర్ల ధ్వని
బిర్యానీ భాండంలా, నిభాయించలేని
కాళ్ళకింది గుండెలో సెగలు గక్కే భూమి
మనసంతా నల్లటి సిఫర్ కప్పిన పరదా !
..
నీకక్కడ ఎర్ర సముద్రం ఒడ్డంతా
వలస చేతుల్నుంచి పిండిన రక్తమూ
పెర్షియన్ గల్ఫ్ ఉప్పుద్రవమంతా
తనఖా పెట్టిన దు:ఖపు కన్నీరూ తప్ప
వీసా చెట్టుకి తియ్యటి ఖర్జూరమెప్పుడూ కాయదు.
పి. శ్రీరాం || మెహరూం కా మోహబ్బత్ నామా
..
ఊరిపొలంలోకిన్ని నీళ్ళు రాలేదని
గట్టుతెగిన కన్నీళ్ళ దేహాన్నో గుప్పిట మూటగట్టుకుని
వత్తిలా కాలుతున్న చూపుల ఇంటిదీపాన్నొదిలి
నేలలో నాటిన పసి గింజల్నొదిలి
అమ్మ కడుపులోంచి
ఎక్కడికో సుదూరంగా వెళ్ళి
నువ్వో దిగులు ఇసుకగూడు కడతావు
..
ఇరుకింటి మోరీ లాంటి ఆకలి కడుపులో
కడుగుతున్న చాయ్ కప్పులూ సాసర్ల ధ్వని
బిర్యానీ భాండంలా, నిభాయించలేని
కాళ్ళకింది గుండెలో సెగలు గక్కే భూమి
మనసంతా నల్లటి సిఫర్ కప్పిన పరదా !
..
నీకక్కడ ఎర్ర సముద్రం ఒడ్డంతా
వలస చేతుల్నుంచి పిండిన రక్తమూ
పెర్షియన్ గల్ఫ్ ఉప్పుద్రవమంతా
తనఖా పెట్టిన దు:ఖపు కన్నీరూ తప్ప
వీసా చెట్టుకి తియ్యటి ఖర్జూరమెప్పుడూ కాయదు.
..
నువ్విల్లు వదిలి వెళ్ళినప్పటినుండీ
దొడ్లో పూసిన మల్లె పూవు
కిద్మత్ పక్కమీద ఒంటరి గీతమాలపిస్తుంది
నువు పంపే దీనార్లూ , దీరమ్ములనుండీ
నిన్నొదిలి ఉండలేని ఆనవాళ్ళు
ఎప్పటికీ జన్నతులుగా తర్జుమా కావు
..
నువ్విల్లు వదిలి వెళ్ళినప్పటినుండీ
దొడ్లో పూసిన మల్లె పూవు
కిద్మత్ పక్కమీద ఒంటరి గీతమాలపిస్తుంది
నువు పంపే దీనార్లూ , దీరమ్ములనుండీ
నిన్నొదిలి ఉండలేని ఆనవాళ్ళు
ఎప్పటికీ జన్నతులుగా తర్జుమా కావు
..
ఇసుక యంత్రానికి మరమేకులు దిగ్గొడుతూ
ఎడారి ఆశల గాలిపటానికి
నువ్వొక్కడివీ పేదరికం తోకలా వేలాడతావు.
ఏ పూట తిన్నావో, ఎంత కునుకు దీశావో ?
అకల నిరంకార, అలక్ నిరంజన
గుర్బనీ కీర్తనలు పాడే పక్కింటి సర్దారమ్మ
అజా బురుజు లాంటి గొంతులోంచి
ఎగిరే మెత్తటి పావురమెప్పుడూ
నమాజు సమయానికి ఇంటిమీద వాలుతుంది
ఎడారి ఆశల గాలిపటానికి
నువ్వొక్కడివీ పేదరికం తోకలా వేలాడతావు.
ఏ పూట తిన్నావో, ఎంత కునుకు దీశావో ?
అకల నిరంకార, అలక్ నిరంజన
గుర్బనీ కీర్తనలు పాడే పక్కింటి సర్దారమ్మ
అజా బురుజు లాంటి గొంతులోంచి
ఎగిరే మెత్తటి పావురమెప్పుడూ
నమాజు సమయానికి ఇంటిమీద వాలుతుంది
..
ఆరుబయట పడుకుని
అరచెయ్యిలాంటి పుట్టిన ఊళ్ళోని ఆకాశంలో
అరిగిపోయిన భాగ్య రేఖల్ని లెక్కగడుతున్నపుడు
నాకు
పుట్టుమచ్చలు వెతికిన
పరాయి దేశం మోకాళ్ళమీద నిలబడ్డ
నలభైమంది ఇంటి నెలవంకలు కనిపిస్తున్నాయి
ఆరుబయట పడుకుని
అరచెయ్యిలాంటి పుట్టిన ఊళ్ళోని ఆకాశంలో
అరిగిపోయిన భాగ్య రేఖల్ని లెక్కగడుతున్నపుడు
నాకు
పుట్టుమచ్చలు వెతికిన
పరాయి దేశం మోకాళ్ళమీద నిలబడ్డ
నలభైమంది ఇంటి నెలవంకలు కనిపిస్తున్నాయి
*
ఆకలి నా అస్తిత్వమే కావొచ్చు
బంగారు పళ్ళెంతో
సేవాదార్ లంగర్కి పిలుస్తున్నపుడు
భక్తితో దుపట్టా తలమీద కప్పుకుంటాను
మతం నాకు పోరాడ్డం నేర్పించిన గురువు.
ఆకలి నా అస్తిత్వమే కావొచ్చు
బంగారు పళ్ళెంతో
సేవాదార్ లంగర్కి పిలుస్తున్నపుడు
భక్తితో దుపట్టా తలమీద కప్పుకుంటాను
మతం నాకు పోరాడ్డం నేర్పించిన గురువు.
(ఇరాక్ లో ని మోసుల్ పట్టణంలో ఐసిస్ కి బలయ్యిన 39 మంది భారతీయుల స్మృతిలో)
------------------------------------------
మెహ్ రూం - పరాధీన, వంచిత
సిఫర్ - ఖాళీతనం
జన్నత్ - స్వర్గం
కిద్మత్ – సేవ
------------------------------------------
మెహ్ రూం - పరాధీన, వంచిత
సిఫర్ - ఖాళీతనం
జన్నత్ - స్వర్గం
కిద్మత్ – సేవ
No comments:
Post a Comment